by సూర్య | Tue, Oct 26, 2021, 10:29 AM
బిగ్బాస్ సీజన్-5 సోమవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక కన్ఫెషన్ రూమ్లో తన గురించి ఎందుకు నెగెటివ్ గా చెప్పావని రవి తన ఫ్రెండ్ లోబోను అడిగాడు. ఏదైనా ఉంటే ఇద్దరం నేరుగా మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నాడు. అనీ మాస్టర్ కూడా లోబో మాటల పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈసారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరికైతే పవర్ రూమ్ లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం వారు నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్ అవుతారని బిగ్బాస్ చెప్పాడు. మొదటగా మానస్, శ్రీరామ్లు పవర్రూమ్లోకి వెళ్లి లేఖలు తీసుకొచ్చారు. అందులో లోబో, ప్రియాంకల లెటర్లు ఉన్నాయి. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని అంటూనే ప్రియాంక లెటర్ ను ఆమెకు ఇచ్చేందుకు లోబో ఓకే చెప్పాడు. ఆ తర్వాత షణ్ముఖ్, రవిలకు విశ్వ, సిరి లేఖలు వచ్చాయి. విశ్వ చెప్పిన కారణానికి సిరి ఓకే చెప్పేసి, లెటర్ ఇచ్చేసింది. కాజల్-ప్రియాంకలు తెచ్చిన లేఖల్లో అనీ మాస్టర్, మానస్ల లేఖలు ఉన్నాయి. మరో ఆలోచన లేకుండా మానస్ తన అవకాశాన్ని అనీ మాస్టర్ కు ఇచ్చాడు. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లేఖలు వచ్చాయి. శ్రీరామ్ కు లెటర్ చదువుకోవడానికి రవి అవకాశం ఇచ్చాడు. శ్రీరామ్ తన లేఖ చదువుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అనీ, సిరిలు పవర్ రూమ్కు వెళ్లి తెచ్చిన లేఖల్లో కాజల్, షణ్ముఖ్ లెటర్లు వచ్చాయి. ఈ సందర్భంగా కాజల్ ఎమోషన్ను చూసిన షణ్ముఖ్ తన లెటర్ను త్యాగం చేశాడు. చివరిగా కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. జెస్సీ లెటర్ తీసుకొచ్చి, అది జెస్సీ చదవాలంటే ఇప్పటికే లెటర్ పొందిన వారు దాన్ని త్యాగం చేసి, నామినేషన్స్లో ఉండాలని బిగ్బాస్ చెప్పాడని వివరించాడు. దీంతో శ్రీరామ్ తన లెటర్ను త్యాగం చేశాడు. చివరిగా కెప్టెన్ సన్నీకి ఎలాంటి కండీషన్స్ లేకుండా లెటర్ రావడంతో దాన్ని చదివి ఆనందం పడ్డాడు. చివరకు ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ లు నామినేట్ అయ్యారు.
Latest News