by సూర్య | Mon, Oct 25, 2021, 05:16 PM
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఈరోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు నటి అనన్య పాండే హాజరు కావడం లేదు. వృత్తిపరమైన పనులు ఉన్నాయని పేర్కొంటూ యాంటీ-డ్రగ్ ఏజెన్సీ సమన్లకు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని అనన్య కోరింది. అనన్య ఈ రోజు వచ్చి ఉంటే ఒక వారం లోపు ఇది మూడవసారి కావడం గమనార్హం.
ఆర్యన్ ఖాన్ ఫోన్లో రెండేళ్ల వాట్సాప్ చాట్ల ఆధారంగా అనన్య పాండేకు ఎన్సీబీ మొదట సమన్లు పంపింది. వీటి వివరాలను యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ అంతకుముందు లీక్ చేసింది. ఆమె సమాధానాలు సంతృప్తికరంగా లేనందున ఆమెను మళ్లీ పిలిచినట్లు ఏజెన్సీ వర్గాలు సూచించాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆమె ఇంటిపై కూడా ఎన్సిబి దాడి చేసింది. ఆమె ఫోన్ ల్యాప్ ట్యాప్ ను ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.
అనన్య పాండేని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ప్రశ్నిస్తున్నారు - విచారణకు నాయకత్వం వహిస్తున్నారు. 2018-19లో అనన్య మూడుసార్లు ఆర్యన్కు సహాయం చేసిందని సూచించే చాట్లపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ సంభాషణలలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఉందన్న ఆరోపణలను అనన్య ఖండించింది. ఆమె ఎన్నడూ నిషేధిత మాదకద్రవ్యాలను వినియోగించలేదని స్పష్టం చేసింది. తాను సరఫరా చేయలేదని ఎన్సీబీ అధికారులకు చెప్పింది. అనన్యపాండేని గత వారం రెండు వేర్వేరు సందర్భాలలో మొత్తం ఆరు గంటల పాటు ప్రశ్నించారు.
ఒక ఎన్సీబీ అధికారి మాట్లాడుతూ ఏజెన్సీ ఈ దశలో అనన్యను "విచారణలో భాగం" కాకుండా కుట్రదారుగా పరిగణిస్తోందని.. ఆమెకు సమన్లు పంపబడినందున ఆమె అనుమానితురాలు అని అర్థం కాదు" అని చెప్పారు.
Latest News