by సూర్య | Mon, Oct 25, 2021, 01:58 PM
సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కాసేపటి క్రితం అందుకున్నారు. ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్.. అసురన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్ స్థానిక ఫోయెస్గార్డెన్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇలాంటి శుభతరుణంలో తన గురువు కే బాలచందర్ లేకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు. సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది అని అన్నారు.
Latest News