ట్విట్టర్‌ వేదికగా విరాట్‌ కోహ్లీని పొగిడిన ఆర్జీవీ

by సూర్య | Mon, Oct 25, 2021, 12:11 PM

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తుంటాడు. తనకి నచ్చిన వ్యక్తులను ఆకాశానికెత్తుతూ, నచ్చని వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా భారత్ - పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై కూడా ఆర్జీవీ స్పందించాడు.మ్యాచ్ అనంతరం రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో మ్యాచ్ కి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. 'విరాట్‌ కోహ్లీ నువ్వు మ్యాచ్‌లో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించావు. ఎలాంటి అహంభావానికి పోకుండా ప్రత్యర్థుల విజయాన్ని ప్రశంసించావు. అందుకు నీకు వందనాలు' అంటూ ట్విట్టర్‌ వేదికగా విరాట్‌ కోహ్లీని ఆర్జీవీ ప్రశంసించాడు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు 17.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 152 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘనవిజయాన్ని సాధించింది.


 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM