కొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన 'వరుడు కావలెను' మూవీ టీం

by సూర్య | Mon, Oct 25, 2021, 12:06 PM

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్‌లోనూ మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అలరిస్తుండటం. ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తుండటంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కొన్ని పెళ్ళిళ్ళకు ‘వరుడు కావలెను’ యూనిట్ హాజరైంది. అయితే ఎలాంటి ఆహ్వానం లేకుండా సరప్రైజ్ విజిట్‌గా నాగశౌర్య, రీతూ వర్మ హాజరు కావటంతో ఆ యా పెళ్ళి మండపాలలో సందడి నెలకొంది.


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM