by సూర్య | Sat, Oct 23, 2021, 02:49 PM
నివేదా థామస్… తనదైన నటనతో ప్రేక్షకులకు మైమరిపించగలదు ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే పవర్స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో పల్లవి పాత్రలో అదరగొట్టేసింది నివేదా. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక పని గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారోను అధిరోహించిన నివేదా… శిఖరాగ్రంపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. ఆ ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎత్తైన పర్వతం అధిరోహించడం చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లో పేర్కొంది.
Latest News