లైగర్ మూవీతో ఇండియా షేక్ అవుతుంది: విజయ్

by సూర్య | Sat, Oct 23, 2021, 10:51 AM

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేసిన చిత్రం రొమాంటిక్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించాడు. ఛార్మి ఈ చిత్రానికి నిర్మాత కాగా పూరి జగన్నాథ్ కథ, డైలాగ్స్ అందించాడు. రొమాంటిక్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రరిలీజ్ ఈవెంట్ నిన్న వరంగల్ లో జరిగింది. అయితే   రొమాంటిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సందడి చేసాడు. ఈ సందర్భంగా  విజయ్ దేవరకొండ రొమాంటిక్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ దాదాపు అదే కోర్ టీమ్ తో తాను చేస్తోన్న లైగర్ గురించి కూడా స్పందించాడు.'గత కొన్ని నెలలుగా మీరు అసహనానికి లోనవుతున్నారు. అందుకే లైగర్ గురించి ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. డెస్టినీ మా ముగ్గురినీ (విజయ్, పూరి, ఛార్మి) కలిపింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాకు వీళ్ళ కష్టం ఒక్క విజువల్ పడితే అర్ధమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయ్యాం. ఇండియా షేక్ అవ్వాలి. 2022లో ఆగ్ లగాదేంగే. ఫిక్స్ అయిపోండి.' అని తన మాటలతో అంచనాలను పెంచేసాడు.లైగర్ ప్యాన్ ఇండియా రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తాడు.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM