by సూర్య | Sat, Oct 23, 2021, 10:50 AM
ఓ వైపు నటనా ప్రాధాన్యపాత్రలు ఎంచుకుంటూనే మరోవైపు కమర్షియల్ నాయికగానూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది నటి నివేదా పేతురాజ్. ఈ ఏడాది ‘రెడ్’, ‘పాగల్’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త సినిమాకి సంతకాలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘రాజా విక్రమార్క’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే ఆయన ఓ కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయనున్నారు. ఇప్పుడీ చిత్రం కోసమే నివేదాను కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో చిత్ర బృందం కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పిందని ప్రచారం వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. నివేదా ప్రస్తుతం ‘విరాటపర్వం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
Latest News