by సూర్య | Sat, Oct 23, 2021, 09:49 AM
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన తాజా సినిమా 'జై భీమ్'. ఈ సినిమాలో గిరిజనులకు జరిగే అన్యాయాలపై పోరాడే లాయర్ పాత్రలో సూర్య నటిస్తున్నారు. రావు రమేశ్ మరో లాయర్ పాత్రలో నటిస్తుండగా, పోలీసు అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. తప్పుడు కేసులో ఇరికిన గిరిజనులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేసే లాయర్ పాత్రలో నటిస్తున్న సూర్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. 'పోరాడుదాం.పోరాడుదాం.. న్యాయం జరిగే వరకు పోరాడుదాం' అన్న నినాదాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'జై భీమ్' సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాను 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం సూర్య వరుసగా నాలుగు సినిమాలను నిర్మించి ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'జై భీమ్'లో ఇతర ప్రధాన పాత్రల్లో రజీషా విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ నటించారు.
Latest News