by సూర్య | Sat, Oct 23, 2021, 07:42 AM
బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తాజాగా నటించిన ఓ యాడ్ వివాదాలకు కేంద్రం అయింది. ఆ యాడ్పై బీజేపీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే అభ్యంతరం వ్యక్తంచేశారు. హిందువుల్లో అశాంతిని కల్పించే బదులు.. అన్నింటిపై అవగాహన కల్పించాలంటూ కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్కుమార్ సూచించారు. టైర్ల కంపెనీ సియెట్ రూపొందించిన ప్రకటనలో.. ఆమిర్ ఖాన్ రోడ్లపై టపాసులు కాల్చవద్దంటూ ప్రజలను కోరుతుంటాడు. అయితే.. ఈ ప్రకటన హిందువుల్లో అశాంతిని సృష్టించేలా ఉందంటూ ద సియట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయంకాకు 14వ తేదీన ఎంపీ హెగ్డే లేఖ రాశారు. ఎంపీ లేఖలో మీ కంపెనీ ఇటీవల ప్రకటించిన ప్రకటనలో అమీర్ ఖాన్ వీధుల్లో పటాకులు కాల్చకండి అంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ స్పందనకు ధన్యవాదాలు. దీంతో పాటు రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. అమీర్ ఖాన్ నటించిన ఈ ప్రకటనతో హిందువుల్లో అలజడి రేగుతోందంటూ లేఖలో వివరించారు. రాబోయే రోజుల్లో హిందువుల మనోభావాలను కంపెనీ గౌరవిస్తుందని ఆశిస్తున్నానంటూ ఎంపీ లేఖలో వివరించారు. ఎంపీ అనంతకుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అమీర్ ఖాన్ నటించిన యాడ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Latest News