'మా' లో మహిళల సాధికారత, ఫిర్యాదుల కోసం కమిటీకి శ్రీకారం: విష్ణు

by సూర్య | Fri, Oct 22, 2021, 08:53 PM

మెనిఫెస్టో అమలు దిశగా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 'మా'కు అనుబంధంగా 'ఉమెన్ ఎంపవర్ మెంట్, గ్రీవెన్స్ సెల్' (డబ్ల్యూఈజీసీ) ఏర్పాటు చేస్తున్నట్టు మంచు విష్ణు వెల్లడించారు. 'పద్మశ్రీ' అవార్డు గ్రహీత, ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు సునీత కృష్ణన్ ఈ కమిటీకి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు.


'మా'లో సభ్యత్వం తీసుకునేందుకు మరింత మంది మహిళా కళాకారులు ముందుకు రావాలని మంచు విష్ణు పిలుపునిచ్చారు. 'మా' మహిళా సభ్యులకు భద్రత కల్పించడంలో డబ్ల్యూఈజీసీ ఏర్పాటు తొలి అడుగు అని వివరించారు. నటీమణులకు మరింత శక్తిని అందించడంలో 'మా' తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM