by సూర్య | Fri, Oct 22, 2021, 06:11 PM
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూర్య. గత ఏడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మరోసారి జై భీమ్ లాంటి మరో వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Latest News