నేను ఆర్యన్ తో జోక్ చేశానని కన్నీళ్లు పెట్టుకున్న అనన్య పాండే

by సూర్య | Fri, Oct 22, 2021, 06:08 PM

బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్రూయిజ్ నౌకపై డ్రగ్స్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఈ కేసులో తాజాగా ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె బాలీవుడ్ నటి అనన్య పాండే పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.


నిన్న ఆమెను ఎన్.సీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ చాట్ గురించి అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తాను ఆర్యన్ తో డ్రగ్స్ విషయంలో జోక్ చేశానని అనన్య చెప్పినట్లు సమాచారం.


డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జరిపిన వాట్సాప్ చర్చల్లో అనన్య పేరు రావడంతో నిన్న అధికారులు ఆమె నివాసానికి వెళ్లి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గురువారం మధ్యాహ్నం ఎన్.సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అనన్యను అధికారులు ప్రశ్నించారు. ఆర్యన్ తో వాట్సాప్ చాట్ గురించి ఆరాతీశారు.


వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్ చర్చ జరిగిందని ఎన్.సీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. గంజాయి కోసం ఆర్యన్ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్ ఉందని సమాచారం. ఈ చాట్ ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.


తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని..ఎవరికి సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్ కోసం ఆనన్య డ్రగ్స్ పంపించినట్టు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.ఇక ఎన్సీబీ విచారణ సమయంలో అనన్య కన్నీళ్లు పెట్టుకుందని ఆందోళనకు గురైందని తెలిసింది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM