హీరో శింబుపై భారీ కుట్రలు

by సూర్య | Fri, Oct 22, 2021, 03:05 PM

నటుడు శింబుపై కుట్రలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి.రాజేందర్, ఉషా రాజేందర్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఎగ్మూర్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ నిర్మించిన అన్భాదవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రంలో తన కొడుకు శింబు కథానాయకుడిగా నటించారన్నారు.


అయితే అతనికి నిర్మాత పూర్తిగా పారితోషికం చెల్లించలేదని, అలాంటిది శింబునే ఆయనకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారన్నారు. శింబుపై రెడ్‌కార్డు వేయాలనే కుట్ర జరుగుతోందని టి.రాజేందర్‌ ఆరోపించారు. ఉషా రాజేందర్‌ మాట్లాడుతూ ఈకుట్రను సీఎం స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆయన ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM