by సూర్య | Fri, Oct 22, 2021, 02:59 PM
2018 మిస్ ఇండియాతో అందరి దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. ఈ భామ సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనములు నిలుప రాదు చిత్రంతో డెబ్యూ చేసింది. ఆ సినిమా ఫలితం పక్కనపెడితే ఆమె ఇండస్ట్రీని తనవైపు తిప్పుకోవడంలో మాత్రం సక్సెస్ అయింది. మీనాక్షి చౌదరికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి.రీసెంట్ గా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ లో సెకండ్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది. శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. మీనాక్షి చౌదరి ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. అలాగే ఈమె మరో భారీ ఆఫర్ పట్టినట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఇంకా మెయిన్ హీరోయిన్ ను ప్రకటించలేదు కానీ మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మరింత బూస్టప్ ఇవ్వడం ఖాయం.మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతోన్న సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ కల్లా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Latest News