by సూర్య | Fri, Oct 22, 2021, 01:35 PM
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పాలనుకున్న రెజీనా కసండ్రాకి.. కొంతకాలంగా చిన్న సినిమాల్లో పెద్ద పాత్రలు, పెద్ద సినిమాల్లో చిన్నపాత్రలు దక్కుతున్నాయి. అయితే ఆమె సినిమాలతో పాటు ఆమె పలు కంపెనీల బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచారం చేసిన ఒక బ్రాండ్ విషయంలో నెటిజెన్స్ నుంచి ట్రోల్స్ తప్పడం లేదు. ఇంతకీ రెజీనా ప్రచారం చేసింది ఏంటో తెలుసా? ఓ ప్రముఖ కంపెనీ విస్కీ బ్రాండ్ ను.ఇటీవల అమితాబ్, మహేశ్ బాబులాంటి స్టార్స్ .. టోబాకో యాడ్స్ చేసి.. ఆ తర్వాత విమర్శలెదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెజీనా ఏకంగా ఒక మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్ లో మద్యం గ్లాసును పట్టుకొని.. ఓ ప్రముఖ కంపెనీ విస్కీ బాటిల్స్ తో ఉన్న ఫోటోను షేర్ చేశారు రెజీనా. తొమ్మిదేళ్ళ వయసులో యాంకరింగ్ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు సినిమాలు, యాడ్స్ చేసే స్థాయికి చేరుకున్నాను. నా ప్రయాణం ఎప్పటికీ పదిలం. ఈ మూమెంట్స్ ను దీంతోనే సెలబ్రేట్ చేసుకుంటాను అంటూ ఆ కంపెనీ బ్రాండ్ పేరు చెబుతూ .. దానికి ప్రచారం చేస్తూ పోస్ట్ పెట్టారు రెజీనా. దాంతో ఆమెపై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తూ ఏకిపడేస్తున్నారు. మరి ట్రోలర్స్ పై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Latest News