by సూర్య | Fri, Oct 22, 2021, 12:26 PM
బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు సంపాదించుకుంది. కియారా ఎక్కడ అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది ఈ బ్యూటి. అంతేకాదు టాలీవుడ్ లో టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దెగ్గర తన చూపించి రికార్డులని బద్దలు కొట్టడంతో ఈ అమ్మడి క్రేజ్ ఇక ఎక్కడికో వెళ్లిపోయింది.వెంటనే రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిరాశతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. టాలీవుడ్ పై ఆ బ్యూటీకి ఇంకా ఆశ చావలేదు.
అందుకే అవకాశం వస్తే చేసేందు సిద్ధంగానే ఉంది కియారా. తెలుగులో సినిమాలు లేకపోయినా.. సామాజిక మాద్యమాల్లో చురుగ్గానే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులో గిలిగింతలు పెడుతూనే ఉంది. ఆ మధ్య సముద్రం అడుగు భాగాన స్విమ్ సూట్ లో ఈదుతూ సెగలు రేపింది. ఇటీవల బాలీవుడ్ లో సిద్ధార్ధ మల్హోత్సా పక్కన హీరోయిన్ గా షెర్షా అనే చిత్రంలో నటించింది. అంతేకాదు వరుస చిత్రాలను లైన్ లో పెట్టింది ఈ అమ్మడు. కియారా అద్వానీ పూర్తి పేరు కియారా అలియా అద్వానీ. ఆమె ముంబయిలో 1992వ సంవత్సరం జులై 31న తేదీన పుట్టారు. కియారా పేరెంట్స్ జగదీప్, జెనీవీలు. ఈ భామ ఫగ్లీ అనే సినిమాతో హిందీ చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.ఎం.ఎస్.ధోనీతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయారు. ఇక 2017వ సంవత్సరంలో టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో భరత్ అనే నేను చిత్రంతో పరిచయమయ్యారు. ఇక కియారా అద్వానీ తెలుగులో సినిమా అంటే మరో మాట చెప్పకుండా ఐదు కోట్లు చేతిలో పెట్టాల్సిందే. టాలీవుడ్ లో నటించిన ఏ హీరోయిన్ ఇప్పటి వరకు ఐదుకోట్లు తీసుకోలేదు. డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ చేస్తున్న కొత్త సినిమా #RC15 లో కైరా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకున్నారు
Latest News