సమంత తరపు లాయర్ పై కోర్టు ఆగ్రహం...!
by సూర్య |
Fri, Oct 22, 2021, 08:14 AM
టాలీవుడ్ నటి సమంత మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సమంత తరపు లాయర్ బాలాజీ కోర్టును కోరారు. దీంతో కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందు అందరూ సమానులేనని స్పష్టం చేసింది. పేరున్న వ్యక్తా? కాదా? అనేది తమకు అనవసరం అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రొసీజర్ ప్రకారం అరగంట తర్వాత వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Latest News