by సూర్య | Sat, Jun 12, 2021, 12:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఒక పాన్-ఇండియన్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు త్రివిక్రమ్ ఇప్పటికే మొత్తం స్క్రిప్ట్ పనిని పూర్తి చేశాడని దానిని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. అయితే, ఆయన అంతకుముందే మహేష్ బాబు సినిమాని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత మాత్రమే పవర్ స్టార్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్ - ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే దాని కోసం స్క్రిప్టింగ్ ను ప్రారంభించాడు. ఎస్.ఎస్.ఎం.బి28 పూర్తయ్యాక పవన్ ని బౌండ్ స్క్రిప్ట్ తో సంప్రదిస్తాడని తెలిసింది.త్రివిక్రమ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ప్రతిపాదన తెచ్చాక పవన్ కళ్యాణ్ చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ 2022 మిడ్ లో లేదా ఆ తరువాత మాత్రమే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. జల్సా-అత్తారింటికి దారేది- అజ్ఞాతవాసి తర్వాత పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
Latest News