by సూర్య | Sat, Jun 12, 2021, 12:08 PM
లాక్ డౌన్ ప్రభావంతో చాలా సినిమాల విడుదలలు సందిగ్ధంలో పడిపోయాయి. సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు చాలామంది ఓటీటీ విడుదలకు మొగ్గుచూపుతున్నారు. నయనతార కొత్త చిత్రం ‘నెట్రికన్’ చిత్రం కూడ అన్ని పనులు పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ ముగింపు దశలో ఉన్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు ఓటీటీకి వెళ్ళాలా వద్దా అనే విషయంలో ఆలోచనలో పడ్డారు. పలు చర్చల అనంతరం ఓటీటీలోనే సినిమాను రిలీజ్ చేయాలని నయనతార, నిర్మాతలు నిర్ణయించుకున్నారు.డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. భారీ ఆఫర్ కే విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ సినిమాలను అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడిగా మిళింద్ రావ్ కి మంచి పేరు ఉంది. ఆయనే ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. అంధురాలైన నాయిక .. ఒక సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టించింది? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఓటీటీలో ఈ సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
Latest News