by సూర్య | Sat, Jun 12, 2021, 11:15 AM
మహేష్ బాబు వన్..నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కృతిసనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో సరైనా అవకాశాలు లేక బాలీవుడ్ కు చెక్కేసి..అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయిందికృతి సనన్ ఇప్పుడు ప్రభాస్ కు జంటగా 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. 'తను నా మొట్టమొదటి కోస్టార్.. ఎంతో అద్భుతమైన వ్యక్తి.. ఆయనతో మరోసారి నటిస్తానని ఆశిస్తున్నాను' అంటూ చెప్పింది.
Latest News