by సూర్య | Fri, Jun 11, 2021, 12:59 PM
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కెరీర్ కు సంబంధించిన విషయాలను అలాగే సమాజంలో జరుగుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రకుల్ ఓ పత్రికలో వచ్చిన దారుణమైన అత్యాచార ఘటన గురించి మాట్లాడుతూ ఈ ఘటన గురించి పత్రికలో చదువుతున్నప్పుడు నా రక్తం మరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో మనిషికి మనిషి తోడు అని చెబుతున్నారు అందరూ. కానీ కష్టకాలంలో కూడా కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు ఇలా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడపిల్లలకు రక్షణ మాత్రం దొరకడం లేదు. ఆడపిల్ల జీవితం మొత్తం అడుగడుగునా లైంగిక వేధింపులు అత్యాచారాలతో దుర్భరంగా మారిపోతుంది. అయితే ఇటీవల దేశంలో నెలకొన్న పరిస్థితులపై టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా స్పందించింది.
Latest News