by సూర్య | Wed, Jun 09, 2021, 02:24 PM
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కి పనులు అన్నీ జరుగుతుండగా మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది.
ఈ సమస్య త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు చుట్టుకుంది. పరశురామ్ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలుపెడతాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనేది త్రివిక్రమ్ ఆలోచన. కానీ తెలుగులో ఎవరూ దొరకట్లేదు. అందుకే తమిళం, మలయాళం వెతుకుతున్నారట. ఈ వెతుకులాటలో ఒక హీరోయిన్ పేరును గట్టిగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమే మాళవిక మోహనన్. ఈ మలయాళీ బ్యూటీకి మాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన ‘మాస్టర్’ చిత్రంతో తెలుగువారికి కూడ పరిచయమైంది. మహేష్ సరసన సరిగ్గా సరిపోయే స్టచర్ ఉన్న హీరోయిన్. అందుకే ఆమె పేరును పరిశీలిస్తున్నారట. తెలుగులో ఏ హీరోయిన్ దొరక్కపోతే ఆమెనే ఫైనల్ చేస్తారని టాక్. అదే గనుక జరిగితే తెలుగులోకి మరొక మలయాళీ ముద్దుగుమ్మ గ్రాండ్ ఎంట్రీ ఖాయం.
Latest News