పేదల ఆకలి తీరుస్తోన్న రాశీఖన్నా

by సూర్య | Wed, Jun 09, 2021, 09:01 AM

కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు హీరోయిన్ రాశీఖన్నా. ఎందరో సెలబ్రిటీలు పేదలకు, ఇబ్బందుల్లో ఉన్న వారికి తమ వంతు సాయాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే రాశీఖన్నా కూడా అడుగు పెట్టారు. లాక్‌డౌన్ కారణంగా పనిలేక తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారాన్ని అందించే పనికి శ్రీకారం చుట్టారు. రోటీ బ్యాంక్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి రాశీఖన్నా పేదలకు తన వంతుగా తోడ్పాటును అందిస్తున్నారు. వాలంటీర్స్‌తో కలిసి వృద్ధాశ్రమాలకు, రోడ్డుపై ఉండే జంతువులకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం విరాళాలను సేకరించడానికి ముందుకు వచ్చారు రాశి. అందుకోసం ఓ వీడియో కూడా విడుదల చేసి విరాళాలు అందించాలని కోరారు.

Latest News
 
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM