by సూర్య | Tue, Jun 08, 2021, 12:25 PM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తరువాత రానా హీరోగా ‘హిరణ్యకశ్యప’ను మొదలుపెడతానని ఇటీవల గుణశేఖర్ చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి సురేష్ బాబు నిర్మాతగా తప్పుకున్నారని సమాచారం. అలా అయితే ఇప్పుడు మళ్లీ గుణశేఖర్ నిర్మాత కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఇదిలా ఉండగా.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పౌరాణిక కథతో రానున్న ఈ సినిమాకు ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. గతంలో మహేశ్ బాబు హీరోగా గుణశేఖర్ ’ఒక్కడు‘, ’అర్జున్‘, ’సైనికుడు‘ సినిమాలను రూపొందించారు.లాక్ డౌన్ సమయంలో ఈ కథపై ఆయన పూర్తిస్థాయి కసరత్తు చేశారట. ఈ కథకి మహేశ్ బాబు అయితే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని చెబుతున్నారు.
Latest News