by సూర్య | Sat, Jun 05, 2021, 03:29 PM
సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ.. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ఎదిగారు రాజమౌళి.ఇప్పటివరకు రాజమౌళి రూపొందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగానే నిలిచింది. అందుకే ఈ దర్శకధీరుడితో కలిసి సినిమా చేసేందుకు అగ్రహీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో.. భారీ మల్టీస్టారర్ మూవ ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. ఈ మూవీ కోసం అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా అడ్డు పడింది. దీంతో మూవీ షూటింగ్కు బ్రేక్ చెప్పిన చిత్రయూనిట్.. ప్రస్తుతం ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం రాజమౌళి కరోనా పరిస్థితులపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుత ఈ క్లిష్ట పరిస్థితులపై ఒక 19 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ వారి సహకారంతో తెరకెక్కించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ షార్ ఫిల్మ్ ను రాజమౌళి త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికి భారీ సినిమాలను రూపొందించిన రాజమౌళి నుంచి రాబోయే ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Latest News