by సూర్య | Wed, Jun 02, 2021, 12:28 PM
టాలీవుడ్ లో తన ఇమేజ్ తో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న కుర్ర హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.తన స్టైల్, మేనరిజమ్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడుగా విజయ్ దేవరకొండ మారిపోయాడు.మరోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రతి ఏడాది నిర్వహించిన విధంగానే ఈ యేడాది కూడా హైదరబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ నటీనటుల జాబితాను సిద్ధం చేసింది. కాగా 2016 లో దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితో 20వ స్థానంలో నిలిచారు. ఇక 2017 లో రెండో స్థానంలో నిలవగా 2018 నుండి వరుసగా 2019,2020 సంవత్సరాల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక విజయ్ దేవరకొండ ఈ యేడాది మొదటిస్థానంలో నిలవగా రామ్ పోతినేని మూడో స్థానంలో నిలిచారు. అంతే కాకుండా రామ్ చరణ్ మూడో స్థానంలో, ఎన్టీఆర్ పంతొమ్మిదో స్థానంలో నిలిచారు.
ఇక వరుసగా విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నిలవడంతో రౌడీ అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాత్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Latest News