by సూర్య | Wed, Jun 02, 2021, 12:06 PM
కన్నడలో చాలా సినిమాల్లో నటించినా కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల ద్వారానే యశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.కరోనా, లాక్ డౌన్ వల్ల ఎంతోమంది కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.దీన్ని గ్రహించిన యష్ తన వంతుగా వారి కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. మొత్తం 3000 మంది సినీ కార్మికుల కోసం 1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రతి ఒక్కరి ఖాతాలోకి 5000 రూపాయలు జమచేస్తున్నారు. ఇంతవరకు కన్నడ ఇండస్ట్రీలో ఇంతపెద్ద సహాయం చేసిన హీరో ఎవ్వరూ లేరు. ఈ సహాయం కార్మికుల కష్టాలను దూరం చేయలేకపోవచ్చు కానీ ఈ కష్టకాలంలో వారికి ఒక ఆశాకిరణంలాంటిదని అన్నారు. యష్ చేసిన సహాయాన్ని చూసిన కన్నడ సినీ జనం తన స్థాయికి తగ్గట్టే భారీ విరాళం ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడని, మిగతా స్టార్ హీరోలు కూడ ఇలాగే తోచిన సహాయం చేసి కార్మికులను ఆదుకోవాలని అంటున్నారు. ఇకపోతే యష్ నటించిన ‘కెజిఎఫ్-2’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Latest News