by సూర్య | Tue, Jun 01, 2021, 01:37 PM
అసురన్, కర్ణన్ వంటి చిత్రాల తర్వాత ధనుష్ నటుడుగా చాలా మెట్లు ఎక్కాడు. కోలీవుడ్ టాప్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అలాంటి హీరో నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘జగమే తంత్రం’. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్లో విడుదల చేసే ఛాన్స్ లేకపోవడంతో.. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్.ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ జూన్ 18 నుంచి ఈ చిత్రాన్ని టెలీకాస్ట్ చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేసింది యూనిట్. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని కన్ఫాం చేసింది ట్రైలర్. ఇందులో మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు ధనుష్.తమిళనాడుకు చెందిన ‘సురలి’ అనే గ్యాంగ్ స్టర్ లండన్ వెళ్తాడు. అక్కడి పొలిటికల్ లీడర్ ఒకరు సురలిని పిలిపించుకుంటాడు. లండన్ లో జరుగుతున్న ఆయుధాలు, బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడం సురలి పని. ఈ నేపథ్యంలో అక్కడి గ్యాంగ్ స్టర్లను సురళి ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ప్రధాన కథాంశంగా ఉంది.ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లో ధనుష్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ గా సాగింది. సురలి పాత్రలో ధనుష్ కుమ్మేశాడు. ఇప్పటి వరకూ చూడని కొత్త పాత్రలో హీరో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. పాటలతో అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్.. బీజీఎంతోనూ దుమ్ములేపాడని ట్రైలర్ చెబుతోంది.వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్ లో ‘జగమే తంతిరమ్’ పేరుతో విడుదల కాబోతోంది. మరి, ధనుష్ సరికొత్త క్యారెక్టర్లో ఎలా నటించాడో తెలియాలంటే ఈ నెల 18 వరకు వెయిట్ చేయాల్సిందే.
Latest News