పవర్ స్టార్ ను డైనమేట్ గా కితాబిచ్చిన విజయేంద్ర ప్రసాద్.!

by సూర్య | Tue, Jun 01, 2021, 01:20 PM

విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమసే.. ఆయన సినిమాలకు కథలను సమకూరుస్తూ.. రచయతగా అంతే పాపులర్ అయ్యారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ప్యాన్ ఇండియా హీరోలు, ప్యాన్ ఇండియా దర్శకులతో సమానంగా ప్యాన్ ఇండియా రచయతగా విజయేంద్ర ప్రసాద్ కథల కోసం టాలీవుడ్ నుంచి మొదలు పెడితే.. బాలీవుడ్ బడా హీరోలు, నిర్మాణ సంస్థలు ఎదురు చూసేలా చేస్తున్నారు.  ఇప్పటికే ఈయన ఇచ్చిన కథలతోనే  హిందీలో ‘భజరంగీ భాయిజాన్’, మణికర్ణిక’ వంటి సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. అంతేకాదు ప్రస్తుతం బాలీవుడ్‌లో సెట్స్ పైన ఉన్న పలు సినిమాలతో పాటు ‘సీత’ సనిమాకు కథను అందించారు విజయేంద్ర ప్రసాద్. ఈటీవీలో ప్రసారం అయ్యిన ఆలీతో సరదాగా ప్రోగ్రాం తాజా ఎపిసోడ్ లో తెలిపారు.ఒక్కో హీరోకి ఎలాంటి కథను అయితే మీరు రాస్తారు అనే ప్రశ్నకి పవన్ వంతు వచ్చినపుడు ఆ ఆసక్తికర పాయింట్స్ చెప్పారు. పవన్ కి అయితే కొత్తగా కథ అసలు అవసరమే లేదని అతన్ని చూడ్డానికే ప్రజలు థియేటర్స్ కి వెళతారని, ఆయన చేసిన సినిమాల్లోనే ఒక్కో సినిమాలో ఒక్కో ముక్క తీసుకొచ్చి పాటలు ఫైట్స్ పెట్టేస్తే చాలని పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్ లాంటి వాడని చిన్న నిప్పురవ్వ అతనకి చాలని ఈ గ్రేట్ రచయిత కితాబిచ్చారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM