by సూర్య | Tue, Jun 01, 2021, 12:56 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. వచ్చే నెలలో సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే సర్కారు వారి పాట విలన్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అనిల్ కపూర్, అరవింద్ స్వామి వంటి పేర్లు వినిపించాయి. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం యాక్షన్ కింగ్ అర్జున్ ను ఈ చిత్రంలో విలన్ గా అనుకుంటున్నారు. మరో వారం రోజుల్లో ఈ అప్డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News