by సూర్య | Mon, May 31, 2021, 11:00 AM
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తొలి భాగానికి సంబంధించిన షూటింగు కొంతవరకే మిగిలిఉంది. కరోనా ప్రభావం తగ్గగానే చకచకా షూటింగును పూర్తిచేయాలనే ప్లానింగుతోనే ఉన్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Latest News