కావాలనే మా కూతురి ఫోటో షేర్ చేయలేదు కోహ్లీ.. కారణం అదేనంట.?

by సూర్య | Mon, May 31, 2021, 10:59 AM

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే కపుల్స్ లో.. టీమిండియా కెప్టెన్ కోహ్లీ- అనుష్క శర్మ ముందు వరసలో ఉంటారు. ఆ మధ్య వీరిద్దరూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు తమ కూతురు వామిక ముఖాన్ని నెటిజన్లకు చూపించలేదు. సోషల్ మీడియాలో ముగ్గురూ ఉన్న పిక్ షేర్ చేసినప్పటికీ.. ఫేస్ కనిపించలేదు. అయితే.. కావాలనే ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారీ దంపతులు. దీంతో.. ఎందుకిలా చేశారన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. తాజాగా ఇన్ స్టా వేదికగా.. అభిమానులతో క్వశ్చన్ అవర్ నిర్వహించాడు విరాట్. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు. ఇందులో కొందరు కోహ్లీ కూతురి గురించి అడిగారు. ఇప్పటి వరకూ వామికను ఎందుకు చూపించలేదు? ఆ చిన్నారి ఫొటోను మేం చూడొచ్చా? అని ఓ నెటిజన్ అడిగారు. దానికి.. ఉద్దేశపూర్వకంగానే తమ కూతురి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయలేదని సమాధానం ఇచ్చాడు కోహ్లీ. దానికి కారణం ఏంటన్నది కూడా చెప్పాడు. సోషల్ మీడియా అంటే ఏంటన్నది తన కూతురికి అర్థమైన రోజున అవగాహన కలిగిన రోజున తనే షేర్ చేస్తుందని చెప్పాడు. ఆమె తన ఫీలింగ్స్ ను సొంతంగా వ్యక్తం చేసే వరకు తన ఫొటోలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించామన్నాడు. భార్య అనుష్క తాను కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు కోహ్లీ. ఇక తన కూతురి పేరుకు అర్థమేంటని ఓ నెటిజన్ అడగ్గా.. దాన్ని కూడా వివరించాడు. వామిక అంటే.. దుర్గామాతకు ఉన్న మరోపేరు అని చెప్పాడు కోహ్లీ. ఈ విధంగా తన కూతురికి సంబంధించిన విషయాలను వెల్లడించాడు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM