by సూర్య | Sat, May 29, 2021, 02:49 PM
అనన్య పాండే..బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా హిందీ ఇండస్ట్రీలో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తో ఏకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది. పూరి జగన్నాథ్ ఒక హీరోయిన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడంటే మేకర్స్ తో పాటు హీరోల దృష్టి గట్టిగానే పడుతుంది. అంత క్రేజ్ ఉండేలా పూరి ..తన సినిమాలలో హీరోయిన్ ని చూపిస్తాడు. తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్ ద్వారా తెలుగు తెరకి కేతిక శర్మ పరిచయం అవుతోంది.ఇప్పటికే ఈ బ్యూటీ చేతిలో వైష్ణవ్ తేజ్ సినిమా ఉంది. అలాగే మరో సినిమాకి సైన్ చేసిందని సమాచారం. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి కూడా మూడు సినిమాలతో టాప్ ప్లేస్లోకి వచ్చేసింది. కానీ ఇంకా అనన్య పాండే మాత్రం ఇంకా టాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహర్ – పూరి జగన్నాథ్ – ఛార్మి నిర్మిస్తున్నారు
Latest News