శ్రీకారం సినిమా ప్రొడ్యూసర్స్ శర్వా లీగల్ నోటీసులు?

by సూర్య | Sat, May 29, 2021, 11:34 AM

టాలీవుడ్ హీరోల్లో ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగలిగే నటుల్లో శర్వానంద్ ఒకరు. విభిన్న కథలతో వస్తు హిట్టా ఫ్లాపా అన్నది పెద్దగా పట్టించుకోడు.  మాస్ క్లాస్ సినిమా ఏదైనా శర్వానంద్ తన స్టైల్ లో మెప్పిస్తారు. అయితే చివరగా శర్వానంద్ ఆర్గానిక్ వ్యవసాయం అంటూ "శ్రీకారం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి స్టార్ హీరోలు , కేటీఆర్ వచ్చి సపోర్ట్ చేసినా నిరాశే మిగిలింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. కాగా తాజాగా శర్వానంద్ సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించినట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం మొదట  శర్వానంద్ కు రూ.6 కోట్ల రెమ్యునేషన్ ఇస్తామని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. ఇప్పటివరకు రూ.4 కోట్ల 50లక్షలు ఇచ్చారట. అయితే మిగతా రెమ్యునరేషన్ కోసం హీరో సంప్రదించగా నిర్మాతలు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదట. దాంతో శర్వానంద్ లీగల్ గా వెళుతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM