by సూర్య | Sat, May 29, 2021, 11:17 AM
వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటించిన సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించగా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈసినిమాను మార్చి 26న రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తాజాగా రంగ్ దే సినిమాగురించి మరో అప్డేట్ వచ్చేసింది.కీర్తి క్యారెక్టర్, నితిన్ క్యారెక్టర్ ఆడియన్స్ కుబాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాను ఇప్పుడు ఓటీటీలో వదలడానికి రంగం సిద్ధమైపోయింది. జూన్ 12వ తేదీన జీ 5లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Latest News