ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ

by సూర్య | Fri, May 28, 2021, 03:18 PM

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావంతో ఎక్కువ మంది సందర్శకులు లేకుండా కొద్ది మందితో ఆయన తన తండ్రికి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పెన్నిధి అని బాలకృష్ణ కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. తెలుగు చిత్ర సీమ అభివృద్ది గురించి ఎంతో కృషి చేశారని.. ఎంతో మంది నటులు ఆయనను ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు.


ఎంతో మంది సినీ కార్మికులకు చేయూత ఇచ్చి వారికి అన్నగా మారారని అన్నారు. నటుడిగానే కాదు.. రాజకీయ నేతగా తెలుగు గౌరవాన్ని పెంపొందించారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు చెప్పారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM