by సూర్య | Mon, Apr 12, 2021, 12:51 PM
యాంకర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకులని సుపరిచితమైన సమీరా షరీఫ్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 2006 లో 'ఆడపిల్ల' అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సమీరా.. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి సీరియల్స్ లో నటించింది. ఆమె తమిళంలో కూడా పలు సీరియల్స్ చేసింది. ఆ సమయంలో సినీ నటి సన కుమారుడు సయ్యద్ అన్వర్ ను ప్రేమించింది. వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలి కాలంలో 'అదిరింది' అనే షోకు యాంకర్ గా పని చేసిన సమీరా.. 'అరవింద సమేత' అనే సీరియల్ లో కూడా నటించింది.
Latest News