by సూర్య | Sun, Apr 11, 2021, 12:10 PM
సతీష్ కౌల్.. బీఆర్ చోప్రా రూపొందించిన `మహాభారత్` సీరియల్ 1988 నుంచి 1990 వరకు ప్రసారమయ్యింది . అప్పట్లో ఇది స్టార్ టీవీలో బాగా పాపులర్ అయ్యింది. దీనికి బీఆర్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇందులో ఇంద్రుడి పాత్రలో సతీష్ కౌల్ నటించి మెప్పించారు. కాశ్మీర్ లో 1948 సెప్టెంబర్ 8న జన్మించిన సతీష్ కౌల్ పంజాబి సినిమాలతో కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలోకి అడుగుపెట్టారు. గత గురువారం ఆయన ముంబయిలోని లుధియానాలో గల ఓ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరాక ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నా, ఆయన ఆరోగ్యం మెరుగపడలేదు. ఆసుపత్రిలో చికిత పొందుతూ శనివారం ఉదయం మరణించారు ఈ విషయాన్ని సతీష్ కౌల్ సిస్టర్ సత్య దేవీ ఈ విషయాన్ని పీటీఐకి వెల్లడించింది.
Latest News