by సూర్య | Sun, Apr 11, 2021, 11:51 AM
డిస్టిబ్యూటర్గా కెరీర్ను ఆరంభించి.. ఆ తర్వాత నిర్మాతగా మారి.. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్గా వెలుగొందుతున్నాడు దిల్ రాజు. తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్నారు. ఇక, పవన్ కల్యాణ్తో రీఎంట్రీకి ఒప్పించి.. 'వకీల్ సాబ్' అనే సినిమాను నిర్మించిన దిల్ రాజు.. భారీ హిట్ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ట్రైలర్ లాంఛ్ సమయంలో థియేటర్లో ఉద్వేగంతో ఊగిపోయి మాట్లాడిన ఆయన.. రిలీజ్ రోజే తన భార్య తేజస్వినితో కలిసి సినిమా చూశారు. అంతేకాదు, నిర్మాత అన్న విషయాన్ని మరిచి పేపర్లు విసురుతూ.. ఈలలు వేస్తూ.. కేకలు పెడుతూ థియేటర్లో రచ్చ రచ్చ చేశారు. ‘వకీల్ సాబ్' మూవీ ఘన విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అక్కడ దిల్ రాజు ఫ్యాన్స్ను ఉత్సాహ పరిచేలా ప్రసంగించారు. ‘ఈ సినిమా కలెక్షన్లు కానీ.. టాక్ కానీ అదిరిపోయింది. ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్' అని చెప్పారు. సుదర్శన్ థియేటర్లో మాట్లాడుతూ.. ‘నా డ్రీమ్ హీరోతో సినిమా అనుకున్నప్పుడు నాకు కావాల్సిన రైట్ సినిమా తీసి ఇచ్చాడు వేణు. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. సినిమాకి వచ్చేటప్పుడు అందరూ మాస్క్లు పెట్టుకుని రండి. ఇది కళ్యాణ్ గారు మీకు చెప్పమన్నారు' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. ‘త్వరలోనే ‘వకీల్ సాబ్ మీట్' అనే ఈవెంట్ను చేయబోతున్నాం. దీనికి పవన్ కల్యాణ్ గారు కూడా వస్తున్నారు. మళ్లీ అక్కడ కలుసుకుందాం' అంటూ వాళ్లలో మరింత జోష్ను నింపారు. గతంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేయగా.. దానికి పర్మీషన్ రాలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
Latest News