by సూర్య | Sat, Apr 10, 2021, 03:10 PM
కొన్ని రకాల సినిమాలకు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఇవి సెన్సార్ బోర్డు వల్ల కావొచ్చు.. కొన్ని సంస్థల వల్ల కావొచ్చు. గతంలో ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్కు ముందు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ‘యాంటీ టెర్రరిజం ఫోరమ్', త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆచార్య', ‘విరాట పర్వం' సహా కొన్నిచిత్రాలపై సెన్సార్కు ఫిర్యాదు చేశాయి. కారణం ఏంటంటే...నాలుగు రోజుల క్రితం చత్తీష్గడ్లో మావోయిస్టులు మారనకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సలైట్/మావోయిస్టులకు అనుకూలంగా ఉన్న ‘ఆచార్య', ‘విరాట పర్వం' సినిమాలకు అనుమతి ఇవ్వవద్దని చెబుతూ 'యాంటీ టెర్రరిజం ఫోరమ్' తాజాగా సెన్సార్ బోర్డుకు విన్నవించింది. అలాగే, భవిష్యత్లోనూ అలాంటి సినిమాలను ప్రోత్సహించొద్దని కోరింది.
Latest News