by సూర్య | Sat, Apr 10, 2021, 11:34 AM
బాలీవుడ్ నటి కంగన రనౌత్ జయలలిత పాత్రలో నటించిన చిత్రం 'తలైవి'. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా నిర్మించిన 'తలైవి' చిత్రం విడుదల వాయిదాపడింది. వాస్తవానికి ఈ వేసవిలో చిత్రం రిలీజ్ కావాల్సివుంది. అయితే, ప్రస్తుతం కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నందున చిత్రం విడుదలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ బయోపిక్ లో బాలీవుడ్ నటి కంగన రనౌత్ జయలలిత పాత్రలో నటించగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించాడు.
Latest News