by సూర్య | Fri, Apr 09, 2021, 04:37 PM
కోలీవుడ్ లో అందరూ ధనుష్ నటించిన 'కర్నన్' మూవీ గురించి చర్చించుకుంటున్నారు. ఏప్రెల్ 9న ముందుగా అనుకున్న సమయానికే బాక్సాఫీస్ వద్దకొచ్చింది డైరెక్టర్ మారి సెల్వరాజ్ మూవీ. అయితే, ధనుష్ నటనకి విమర్శకుల నుంచీ, ప్రేక్షకుల నుంచీ అద్భుతమైన ప్రశంసలు అందుతున్నప్పటికీ... తమిళనాడులో కరోనా కేసుల దృష్ట్యా 50 శాతం ఆడియన్స్ ను మాత్రమే సినిమా హాల్స్ లోకి అనుమతిస్తున్నారు. అయినా కూడా తొలి రోజు స్పందన చూసి ఫుల్ జోష్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు, నేరుగా థియేటర్స్ వద్ద జనాల్ని కలసి సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు 'కర్నన్' మూవీ టీమ్. ధనుష్ మాత్రం 'ద గ్రే మ్యాన్' ఇంగ్లీష్ సినిమా షూటింగ్ కోసం విదేశంలో ఉన్నాడు. 'కర్నన్' మూవీ మంచి రివ్యూస్ అందుకుంటూ ధనుష్ ఫ్యాన్స్ కి, తమిళ సినీ పరిశ్రమకి ఉత్సాహం కలిగించినప్పటికీ... పైరసీ వైరస్ నుంచీ మాత్రం తప్పించుకోలేకపోయింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్, టెలిగ్రామ్ వంటి సైట్స్ లో తాజా చిత్రం మొత్తానికి మొత్తంగా అందుబాటులోకి వచ్చేసింది. ఆల్రెడీ కోవిడ్ కారణంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ దెబ్బతింటోన్న నేపథ్యంలో పైరసీ భూతం కూడా దాడి చేయటం, నిర్మాతలకు ఆందోళన కలిగించే పరిణామమే!
Latest News