by సూర్య | Fri, Apr 09, 2021, 03:48 PM
ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా సోకిందని ఐశ్వర్య తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ మలయాళ హీరోయిన్ మాయనది, వరతన్ సినిమాలతో పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘గాడ్సే’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఐశ్వర్యకు తెలుగులో ఇదే తొలి సినిమా.
Latest News