by సూర్య | Fri, Apr 09, 2021, 01:12 PM
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో.. నటి రాధిక కరోనా వైరస్ బారినపడ్డారంటూ.. కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన రాధిక శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి పుకార్లు పుట్టిస్తున్న వారిపై కోర్టుకెళతానని హెచ్చరించారు. కొన్నిరోజుల నుంచి తన ఆరోగ్యంపై ఆన్లైన్లో ఎన్నో పుకార్లు వస్తున్నాయని ఆమె తెలిపారు. 'మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాకు కరోనా వైరస్ సోకలేదు. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి కొంతమంది ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారు. ఈ పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తా' అని నటి రాధిక ట్వీట్ చేశారు.
Latest News