by సూర్య | Fri, Apr 09, 2021, 09:31 AM
ప్రముఖ నటి నగ్మా కరోనా బారినపడ్డారు. ఈమె ఏప్రిల్ 2న ముంబైలో కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామందికి కొవిడ్ అటాక్ కావడం గమనార్హం. నగ్మా బాలీవుడ్లోనే కాకుండా.. టాలీవుడ్లోనూ సుపరిచితమే. తెలుగులో ప్రేమికుడు చిత్రంతో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలతోనూ నటించి మెప్పించారు.
Latest News