by సూర్య | Wed, Apr 07, 2021, 12:06 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో… మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం కాబోతుంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
Latest News