by సూర్య | Tue, Apr 06, 2021, 12:53 PM
మరణించిన తన కొడుకు ఫోటోతో వచ్చి ఓ తండ్రి సినిమా చూడటం అందరిని ఆశ్చర్యపరిచింది. తీరా విషయం ఏంటా అని తెలుసుకున్న తోటి ప్రేక్షకులను దుఃఖంలోకి నెట్టింది. ఈ ఘటన మైసూర్ లో జరిగింది. మైసూరు కువెంపు నగరకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్ 4 నెళ్ల క్రితం ఈతకు వెళ్లి నీటిలో మునిగి మరణించాడు. అతడికి హీరో రాజ్ కుమార్ అంటే క్రేజీ. ఆయన సినిమాలు మొదటి రోజే చూసే వాడు. తాజాగా వస్తున్న యువరత్న సినిమా కూడా తొలి రోజే చూస్తానని తన తండ్రితో చెప్పేవాడు. ఏప్రిల్ 1న విడుదలైన యువరత్న మూవీ కోసం హరికృష్ణన్ ఎదురు చూస్తున్నాడు. అయితే సినిమాకు ముందే హరికృష్ణన్ మరణించాడు. ఎలాగూ తిరగిరాని తమ కుమారుడి కోరికను తీర్చాలని యువరత్న ఆడుతున్న ఓ థియేటర్కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. వస్తూ వస్తూ హరికృష్ణన్ నిలువెత్తు ఫోటోను కూడా వెంట తీసుకువచ్చారు. అలా ఫోటోను తమ పక్కన పెట్టుకుని సినిమా చూశారు. ఏంటా అని విచారించిన తోటి ప్రేక్షకులకు అసలు విషయం చెప్పి బాధపడ్డారు ఆ తండ్రి.
Latest News