by సూర్య | Tue, Apr 06, 2021, 11:11 AM
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మరోసారి కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో `పీకు` మూవీ వచ్చింది. 2015లో విడుదలైన ఈ చిత్రం క్లాసిక్గా నిలిచింది. దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. హాలీవుడ్ హిట్ ఫిల్మ్ `ది ఇంటర్న్` సినిమా ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కబోతోంది.బదాయి హో` ఫేమ్ అమిత్ శర్మ ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రంలోనే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కలిసి నటించబోతున్నారు. `నా మోస్ట్ స్పెషలిస్ట్ కో స్టార్ అమితాబ్గారితో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంద`ని దీపిక పేర్కొంది. `మరోసారి` అని అమితాబ్ ట్వీట్ చేశారు. కాగా, ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కూడా అమితాబ్, దీపిక ప్రధాన పాత్రలు పోషించనున్న సంగతి తెలిసిందే.
Latest News