by సూర్య | Sat, Apr 03, 2021, 12:12 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అడవి శేషు హీరోగా ‘మేజర్’ అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు యువ హీరో నవీన్ పోలిశెట్టిని హీరోగా పెట్టి వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మహేష్ నిర్మిస్తున్న మేజర్ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Latest News